మన్యం న్యూస్ అక్టోబర్ 15 వెంకటాపురం. :
జల్ జమీన్ జంగిల్ ఆదివాసి హక్కు ఆదివాసీల హక్కుల సాధనకై పోరాటం చేసిన యోధుడు మన కొమరం భీమ్, ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీమ్ 82 వ వర్ధంతి ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్న వెంకటరమణ, కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరం భీమ్ ఆసియా సాధన కొరకు ఆదివాసిల హక్కుల సాధనకై ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు. పాలక ప్రభుత్వాలు ఆదివాసి చట్టాల పట్ల, ఆదివాసీల హక్కుల పట్ల కర్కాటకంగా వ్యవహరిస్తుందని పాలక ప్రభుత్వ వ్యవహార శైలి మార్చుకోకపోతే రానున్న ఎన్నికలలో బుద్ధి చెబుతామని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఆదివాసీలు దశాబ్ద కాలం పాటు పోరాటాలు చేస్తున్న పాలక ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు, ఎందుకింత చిన్నచూపు చూస్తుంది.ఆదివాసీలకు అన్యాయం చేయాలని చూస్తే వారికి పుట్టగతులు ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఉయిక శంకర్ , పూణెం వీరభద్రం, వాసం లక్ష్మయ్య, ఏటిఏ నాయకులు పూసమ్ శ్రీను, కాక రాజు, మాజీ సర్పంచ్ నారాయణమ్మ, ఏర్పరాజు, తాటి నాగరాజు, గోపి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: