మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం గ్రామానికి చెందిన యువతి(21) ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుని ప్రేమించింది. ఉపాధి నిమిత్తం హైదరాబాదు వెళ్లిన యువకుడు ఇటీవల తిరిగి రావడంతో, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ఆ యువకుడు నిరాకరించడంతో మనస్థాపానికి గురై పురుగుల ముందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏడూళ్ళ బయ్యారం ఎస్సై టీవిఆర్ సూరి తెలియజేశారు.
Post A Comment: