మన్యం న్యూస్:అన్నపురెడ్డిపల్లి:టి పీసీసీ మెంబర్ గా రెండవ సారి ఎన్నికైన ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి ని తొలిసారి అన్నపురెడ్డిపల్లి వచ్చిన సందర్భంగా ఆమెను శాలువా కప్పి సన్మానించారు.అనంతరం మండల కాంగ్రెస్ ఇంచార్జి వనమా గాందీ అధ్వర్యంలో రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జొడో యాత్ర దిగ్విజయంగా జరగాలని,మునుగోడు నియోజక వర్గంలో పాల్వాయి స్రవంతి గెలవాలని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం,శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారి దేవాలయం,శ్రీ రామచంద్ర స్వామి దేవాలయం,అంకమ్మ తల్లి. దేవాలయాల్లో సున్నం నాగమణి ప్రత్యేక పూజలు చేసారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఓబీసీ అధ్యక్షులు దావ వెంకట రామయ్య,మండల కాంగ్రెస్ నాయకులు గోళ్ల ముత్తయ్య, ఇనుగంటి ప్రసాద్,ఇనపనూరి జమలయ్య,చల్ల పుల్లయ్య,వేముల కోటేశ్వరరావు,సయ్యద్ అహ్మద్, మారగాని రవి,మహిళా కాంగ్రెస్ నాయకురాలు గోళ్ల రేణుక, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: