- పోలీస్ అమరవీరుల త్యాగాలను మరవకండి
- కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు
- కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ,అక్టోబర్ 26 : విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరులైన పోలీస్ వీర జవానుల త్యాగాలను మరువరాదని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి లక్ష్మీదేవి పల్లి సెంట్రల్ పార్క్ వరకు సాగిన బైక్ ర్యాలీ విజయవంతంగా ముగిసింది .ముందుగా ప్రకాశం స్టేడియంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ డి.శ్రీనివాసరావు,6 వ,బెటాలియన్ చాతకొండ అడిషనల్ కమాండెంట్ ఎస్.శ్రీనివాసరావు,కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు జండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ప్రకాశం స్టేడియం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పోస్ట్ఆఫీస్ సెంటర్,బస్టాండ్ సెంటర్,సూపర్ బజార్,మొర్రెడు బ్రిడ్జ్,లక్ష్మీదేవిపల్లి మీదుగా సెంట్రల్ పార్క్ వరకు సాగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మెరుగైన సమాజం కోసం,పోలీస్ అమరవీరుల ఆశయాలను సాధించడం కోసం ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
Post A Comment: