CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి ప్రదాత రేగా చిత్రపటానికి పాలాభిషేకం : రేగాతోనే అభివృద్ధి మండల అధ్యక్షులు నరసింహారావు

Share it:


మన్యం న్యూస్ గుండాల/ఆళ్లపల్లి అక్టోబర్ (17) నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్రపటానికి బోడాయికుంట గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. గ్రామ రహదారి కోసం మొత్తం 9 కోట్ల 63 లక్షల97 రహదారి మరియు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు కేటాయించినందుకు గ్రామస్తులు రేగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు ఆళ్లపల్లి మండలానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ గిరిజన పల్లెల అభివృద్ధి ప్రదాతగా రేగా కాంతారావు చిరస్పనీయంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆయన అన్నారు. మండల అభివృద్ధి జరగాలంటే అది ఒక రేగా తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, సర్పంచులు శంకర్ బాబు, వెంకట్ నారాయణ, మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, యువజన విభాగం అధ్యక్షులు సతీష్ , వెంకన్న , కీసరి నరేష్ , దొడ్డి రాము తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: