CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మా పోడు వ్యవసాయ భూములు సర్వే చేయండి

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం:

ములుగు జిల్లాలోని ఏజెన్సీ మారుమూల ప్రాంతాలలో ఎన్నో ఏండ్ల తరబడి పోడు వ్యవసాయం చేసుకుంటూ సాగులో ఉన్న మా భూములను సర్వే చేయండి అంటూ ఏటూరు నాగారం మండలంలోని దొడ్ల కొత్తూరు ప్రాంతానికి చెందిన దళిత రైతులు తాసిల్దార్ సంజీవ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులతోపాటు జీవనం చేస్తూ మూడు తరాలుగా మా తాత ముత్తాతల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు కావాలని కొంతమంది వ్యక్తులు తమ భూములను సర్వే చేయకుండా అడ్డుపడుతున్నారని వారిపై చర్యలు తీసుకొని మా భూములు సర్వే చేసి మాకు కల్పించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో మందపల్లి సాగర్,పరికి ప్రసాద్,సత్యం, రమేష్,హరిబాబు,నరసయ్య, రాజు,నరేష్,శ్రీను,రవీందర్, నాగమణి,కౌసల్య,దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: