మన్యం న్యూస్ ,అక్టోబర్ 17 ,వాజేడు.:
వాజేడు మండల కేంద్రంలో ప్రజలకు
ఓటు వేసే విధానపరమైన ప్రక్రియ పై సదస్సు నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఓటుహక్కు పై కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి పౌరుని వజ్రాయుధమని ఓటు నిజాయితీగా వేసి నిర్భయంగా జీవించాలని ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన ప్రలోభాల గురి కావద్దని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటూ ప్రజలు మంచి నాయకున్ని ఎన్నుకోవాలని ప్రతి ఓటరు ఓటరు కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలని 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
స్వచ్ఛభారత్ ఓటర్ ఐడిని ఆధార్ కార్డుతో అనుసంధానం ఓటర్ ఐడిలోని ఇంటిపేరు హౌస్ నెంబర్ సవరణలు
ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చాయచిత్ర ప్రదర్శన ద్వారా ఈ విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వాజేడు మండల తహసిల్దార్ గూడూరి లక్ష్మణ్ గిర్ధవర్ కీసరి రాజు జూనియర్ అసిస్టెంట్ కిరణ్ కుమార్ తాసిల్దార్ ఆఫీస్ సిబ్బంది వీఆర్ఏ సురేష్ నాగరాజు గ్రామ సర్పంచ్ ఆదినారాయణ గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.
Post A Comment: