మన్యం న్యూస్ , గుండాల/ఆళ్లపల్లి , అక్టోబర్ (17) : దళిత బంధు పథకం ఒక మహోత్తర పదకమని ఆళ్లపల్లి ఎంపీపీ మంచు భార్గవి అన్నారు. ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేఖ కాంతారావు సూచన మేరకు సోమవారం మండలంలో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల ఇంటికి వెళ్లి ఆమె వాహనాలను ఎలా వినియోగిస్తున్నారని ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడలేని విధంగా మిమ్ములను ప్రభుత్వం ఆదుకోవడం జరిగిందని సక్రమంగా పథకాన్ని వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె సూచించారు. మండలంలో ఉన్న దళితులందరికీ త్వరలోనే దళిత బంధు పథకం చేరుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ ఖయ్యూం, పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: