మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
మండలంలోని లక్ష్మీ నగరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ మొబైల్ షాప్ లో గత పది రోజుల క్రితం జరిగిన మొబైల్ దొంగతనం కేసును చేదించిన పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఈ కేసులో గుర్తు తెలియని దొంగల విచారణలో భాగంగా ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో కలిసి ఆర్ అండ్ బి రోడ్డు నడికుడి సెంటర్ వద్ద సోమవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా డి కొత్తగూడెం గ్రామానికి చెందిన మైనర్ బాలుడు పోలీసు వారిని చూసి కంగారుపడుతూ అనుమాదాస్పదంగా కనిపించడంతో అట్టి బాలుని విచారించగా అతను మొబైల్ షాప్ లో దొంగిలించిన నాలుగు మొబైల్స్ ఒక మొబైల్ ని గుర్తు తెలియని వాళ్ళకి అమ్మినాను అని సీసీ కెమెరా, పవర్ బాక్స్ ను గోదారిలో పడేసానని చెప్పి మిగిలిన మూడు మొబైల్ ఫోన్స్ తీసి పోలీస్ వారికి చూపించాడు అతని వద్ద నుండి అట్టి మొబైల్స్ ను స్వాధీన పరుచుకుని ఆ బాలుడిని ద డిస్టిక్ ప్రొబలేషన్ ఆఫీస్ ఖమ్మం తరలించారు
Post A Comment: