మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులు తమ యొక్క మీటర్లు కుల ధ్రువీకరణ పత్రాలు అందజేసి ప్రభుత్వం అందిస్తున్న 101 యూనిట్స్ ఉచిత విద్యుత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిజిఆర్ఎఫ్ చైర్మన్ సత్యనారాయణ అన్నారు. మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పరిష్కార వేదికలో 15 ఫిర్యాదులు అందాయి విద్యుత్ సరఫరా లో తరచుగా వచ్చు అంతరాములు విద్యుత్ ఎచ్చుతగ్గు సమస్యలు విద్యుత్ మీటర్ సమస్యలు విద్యుత్ బిల్లులలోని అధిక బిల్లు వచ్చు సమస్యలు కొత్త సర్వీస్ లు ఇతర విషయాలపై ఆయన వినియోగదారులకు వివరించారు విద్యుత్ సరఫరా లో ఎలాంటి సేవలో ఉన్న పై పోరంకు ఫిర్యాదు చేయవచ్చు అని అన్నారు.విద్యుత్ ఫోరం అధికారుల ఫోన్ నెంబర్లు 9440811299.9491307004.
8333923840..లో సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ మెంబర్ తిరుమలరావు,ఫైనాన్స్ మెంబర్ చేరందాస్,నరేష్, అకౌంట్ ఆఫీసర్ దేవిదాస్,ఎస్ ఈ పరశురాం నాయక్,డి మల్లారెడ్డి,ఏడి,ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: