అశ్వాపురం,మన్యం న్యూస్:
అశ్వాపురం మండలం తుమ్మల చెరువు లో తుమ్మల చెరువు అయకట్టు రైతులకు 4,35000 నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రొయ్య పిల్లలు తుమ్మలచేరువు ఎంపీటీసీ, తాటి పూజిత ,తుమ్మల చెరువు సర్పంచ్ బండ్ల సంధ్యారాణిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో జాలర్లు ఆర్థిక పరిపుష్టి సాధించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నీలి విప్లవం జరుగుతుందని, సందర్భంగా వారు సీఎం కేసీఆర్ కి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నరసింహారావు ,సొసైటీ సభ్యులు ,మత్స శాఖ అధికారులు, రైతులు వెంకట్లెశ్వర్లు ,శ్రీనివాస్, వీరన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post A Comment: