మన్యం న్యూస్ , దుమ్ముగూడెం, అక్టోబర్ 28::
ప్రభుత్వం డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రాజమ్మ డిమాండ్ చేశారు శుక్రవారం నాడు దుమ్ముగూడెం మహిళా సంఘం మండల కమిటీ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొని మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పులను రుణమాఫీ చేయాలని, అలానే దేశంలో రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 5 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వృద్ధులను కూడా అత్యాచారాలు చేస్తున్నారని అత్యాచారాలు చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో సోయం నాగమణి సర్పంచ్ పూనం కనకదుర్గమ్ జయ రాజేశ్వరి కొమరం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: