అశ్వాపురం,మన్యం న్యూస్ :
అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామపంచాయతీ,కుర్వపల్లి కొత్తూరు ఎఫ్ ఆర్ సీ కమిటీ పరిధిలో జరుగుతున్నటు వంటి పోడు సర్వేను శుక్రవారం అశ్వాపురం తాసిల్దార్ సురేష్ కుమార్ పరిశీలించారు .తహసీల్దార్ మాట్లాడుతూ పోడుదారులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేస్తుందని పోడు భూములు సర్వే చేసి పట్టాలిచ్చే క్రమంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అక్కడి పోడు భూమిదారులకు తెలిపారు సర్వే జరుగుతున్న తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎఫ్ ఆర్ సీ కమిటీ చైర్మన్, సెక్రటరీ వంక పంతులు, కోరేం రామారావు తహసీల్దార్ దృష్టికీ పంచాయతీ లో జరుగున్న పోడు సర్వే ఫారం లో ఒక్క రైతు కు ఒక్క బీట్టు వరకు మాత్రమే నమోదు అవుతుంది అతనికి మిగత మూడు, నాలుగు ప్లేస్ లలో ఉన్న భూమి నీ ఎలా నమోదు చెయ్యాలి అని అడగడం జరిగింది. దీనికి తహసీల్దార్ ,ఐ టి డి ఏ ఎఫ్ ఆర్ సి తహశీల్దార్ నీ సంప్రదిస్తే మొబైల్ అప్పికేషన్ లో అన్నిoటిని నమోదు చెయ్యడం కుదరదు వాటిని పేజీ వెనక వైపు రాయవలసిందిగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ , పంచాయతీ సెక్రటరీ దినేష్ కు సూచించారు. ఈ కార్యక్రమం లో ఎఫ్ ఆర్ సీ కమిటీ చైర్మన్, సెక్రటరీ కమిటీ సభ్యులు యలకం నాగార్జున్, మడకం శ్రీనివాస్, కణితి మహేష్, కణితి చందు, సోయం చందరావు, పైదా నాగేశ్వరావు, మెస్సా నరసింహారావు, వంక మధు, సోడే రామకృష్ణ, గ్రామస్తులు, మహిళా రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: