*బొగ్గు లారీల వేగంపై అధికారుల పర్యవేక్షణ కరువు...
*మణుగూరు లారి ప్రమాదం లో వెంకట్రావు పేట వాసి మృతి
మన్యం న్యూస్, పినపాక :
పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన యువకుడు పోతురాజుల దశరథం లారీ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. కుక్కునూరు మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లి మిరప నారును ఇచ్చి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని బంధువులు వాపోయారు. మృతునికి భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాసేపట్లో ఇంటికి వచ్చే భర్త కానరాని లోకాలకు వెళ్లడంతో భార్య ఆవేదనకు అంతులేదు. కుటుంబాన్ని పోషించే బిడ్డ మరణించడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. బొగ్గులోడుతో వచ్చే లారీల కారణంగా ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారని, అధిక లోడు కారణంగానే ఈ మరణాలు జరుగుతున్నాయని, సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి పరిష్కార దిశగా కృషి చేయాలని పలువురు కోరుతున్నారు.
Post A Comment: