మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం, మల్లాయిగూడెం గ్రామ పంచాయతీలో ప్రభుత్వ విప్ రేగా, మరియు ఎంఎల్ మెచ్చాలు పోడు భూములు సర్వేను ప్రతి మండలంలో మండల నాయకులు పరిశీలించాలని ఆదేశానుసారం, పోడు భూముల సర్వే ను అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, మల్లాయి గూడెం సర్పంచ్ నారం రాజశేఖర్ పరిశీలించారు. అనంతరం అధికారులను, పోడు రైతులను ఎలా సర్వే జరుగుతుందని అడిగి తెలుసుకొని, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పమని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సెక్రటరీ, ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ యువజన కమిటీ సభ్యులు నారం నరసింహ రావు, తుట్టి శ్రీను, దుర్గారావు, వెంకటేష్, సోమరాజు, ఈశ్వర్, చల్మారావు, ప్రభు దాస్, మల్లేష్, నారం రాముడు, గ్రామ పెద్దలు, పోడు సాగు దారులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: