CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆలయాల కమిటీ చైర్మన్ గా చీదెళ్ల పవన్ కుమార్....

Share it:



 మన్యం న్యూస్ ప్రతినిధి చండ్రుగొండ: చండ్రుగొండ పంచాయతీ  దేవాలయాల కమిటీ చైర్మన్ గా చీదెళ్ల పవన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శుక్రవారం జరిగిన పంచాయితీ ఆలయ పాలకమండలి, గ్రామస్తుల విస్తృతస్థాయి సమావేశంలో చీదెళ్ల పవన్ కుమార్  ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, వేద పండితులు వి.వి.ఆర్.కెమూర్తి  నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించి, బాధ్యతలు అప్పగించారు. దేవాలయల ( ఆంజనేయ స్వామి, శివాలయం, మహాలక్ష్మి, సాయిబాబా, ముత్యాలమ్మ,మైసమ్మ, బొడ్రాయి, లంకలవాగు ముత్యాలమ్మ ఆలయాలు ) కమిటీకి ఇకపై పూర్తిస్థాయిలో ఆలయ పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీ చైర్మన్ గా చీదెళ్ల పవన్ కుమార్, వైస్ చైర్మన్ గా  కిరణ్ కుమార్ రెడ్డి, అప్పారావు, సెక్రటరీలుగా సంకా శంకర్, బుంగా శ్రీనివాసరావు, ట్రెజరరీగా అంతటి సత్యనారాయణ తో పాటు, మరో 15 మంది ఆలయ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లంకలవాగు ముత్యాలమ్మ ఆలయంలో  ఆలయ పాలకమండలిని ప్రత్యేకంగా పూజలు చేశారు. పాలకమండలిని మండల టిఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా శాలవతో అభినందించింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్( బిఆర్ఎస్) మండల అధ్యక్షులు, ఎంపీటీసీ దారా వెంకటేశ్వరరావు (బాబు ) టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు, ఉన్నం నాగరాజు, సూర వెంకటేశ్వర్లు, వంకలపాటి బాబురావు, సిపిఎం నాయకులు పెద్దిని వేణు, కాంగ్రెస్ యువజన నాయకులు కేశవబోయిన నరసింహారావు, గ్రామస్తులు కిరణ్,మల్లెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: