మన్యం న్యూస్ గుండాల అక్టోబర్ (14) మండల కేంద్రంలో గ్రంథాలయాన్ని నిర్మించడం కోసం స్థలాన్ని కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ దిండిగల రాజేందర్ తాసిల్దార్ నాగ దివ్య కు వినతి పత్రాన్ని అందించారు. మండల కేంద్రంలో త్వరలోనే గ్రంథాలయాన్ని నెలకొల్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అణువుగా ఉన్న కొన్ని భవనాలను ఆయన పరిశీలించారు. స్థలం కేటాయిస్తే సొంతంగా భవన నిర్మాణాన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి మంజు వాణి, లైబ్రేరియన్ నవీన్, తవిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: