మన్యం న్యూస్ చర్ల /దుమ్ముగూడెం ::
మండల కేంద్రంలోని ఉన్నటువంటి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో డాక్టర్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గర్భిణీ స్త్రీలు గత వారం రోజులు వార్తాపత్రికల్లో కథనాలు రావడంతో స్పందించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు అధికారులతో తో చర్చించి చర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి కొయ్యూరు సీమన్ సెంటర్లో డాక్టర్ గా పి శిరీష ఈరోజు వైద్యాధికారులు నియమించారు. గతంలో కూడా మండలంలో డెంగ్యూ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో స్వయంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ దయానంద్ తో ఫోన్లో మాట్లాడి చర్ల మండలంలోని కుదునూరు గ్రామంలో డెంగు బాధిత కుటుంబాలకు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రసూతి హాస్పిటల్ డాక్టర్ నియామకంపై చర్ల మండల ప్రజలు రేగ కాంతారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: