మన్యం మనుగడ, మంగపేట.
తెలంగాణ ఆల్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ ఏ జె ఎఫ్)ములుగు జిల్లా అధ్యక్షుడిగా ఎఱ్ఱం స్వామి యాదవ్ ఇటీవల ఎన్నిక అయ్యారు. ఈ సందర్బంగాఅంబేద్కర్ యువజన సంఘం కమలాపురం గ్రామం గ్రామ కమిటీఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్ట్ ఎఱ్ఱం స్వామి కి సన్మానం చేసారు ఈ సందర్బంగా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ విలేకర్లు అంటే కలం పట్టిన సైనికులు, అటువంటి వృత్తి ని ఎంచుకొని ప్రజా సమస్యలు ప్రభుత్వం ద్రుష్టి కి తీసుక వస్తున్న విలేకర్లు అందరూ అభినందనీయులే, అందరికి నాయకుడిగా ములుగు జిల్లా అధ్యక్షులు గా ఎన్నిక అయిన సీనియర్ జర్నలిస్ట్ ఎఱ్ఱం స్వామియాదవ్ ని సత్కరించడం మనం అందరం గర్వించదగ్గ విషయం అంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అంబేద్కర్ యువజన సంఘం కమలాపురం గ్రామం అధ్యక్షులు మేడిపల్లి శశి, ప్రధాన కార్యదర్శి గాజర్ల రాజు, కదురు మల్లేష్, యాసం హరీష్, వంకాయల వెంకటేష్, ఎదునూరి రవీందర్, కప్పల కిరణ్ రామకృష్ణ, చింత సబ్బు పరంజ్యోతి రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: