మన్యం న్యూస్ , భద్రాచలం /దుమ్ముగూడెం ::
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న చత్తీస్ గాడ్ రాష్ట్రం బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి అలానే ఆయన వెంట డిసిసి అధ్యక్షులు లాలు జడ్పీ వైస్ చైర్మన్ కారం కమలేష్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ భద్రాచలం నలుమూలన ఎంతో విశిష్ట కలిగిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు దేశ నలుమూలల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు భద్రాచలం సీతారామస్వామి వారి ప్రత్యేక స్థానం ఉందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధి గురించి ఆలోచించకపోవడం అన్యాయమని తెలిపారు ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరళ నరేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సతీష్ వెంకట్ రాము గౌడ్, దుమ్ముగూడెం యువజన నాయకులు కనుబుద్ది దేవ చింతిరాల సుధీర్ ఎడారి ప్రదీప్ రాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: