CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఐ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.. సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు పిలుపు..

Share it:


మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 11) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఈనెల 14న విజయవాడలో జరిగే 24వ జాతీయ మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మండలం నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ జూలూరుపాడు మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండెపిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతరం ప్రజల పక్షాన సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున పోరాటలు  చేస్తుందని తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతోన్మాద దేశ విచ్చిన్నకర ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలని, 14 న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు 25 దేశాల నుండి ప్రతినిధులు వస్తున్నారని, ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎల్లంకి మధు, మండల సహాయ కార్యదర్శులు గార్లపాటి వీరభద్రం, ఎస్కే చాంద్ పాషా, శివకృష్ణ, చంటి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: