మన్యం న్యూస్, అక్టోబర్ 11 ,వాజేడు.:
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని జంగాలపల్లి గ్రామంలోని కుమ్మరి కుంట చెరువులో పడి ఏడవ తరగతి విద్యార్థి గల్లంతైన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. జంగాలపల్లి గ్రామానికి చెందిన ఘనపురపు, అఖిల్ ( 13 )సంవత్సరాలు, పస్రా గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు, దసరా సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చాడు మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఊరు చివరలో ఉన్న కుమ్మరి కుంట చెరుకు చేపల వేట కు వెళ్లి గాలం ఆడుతుండగా చెరువులో చేపల వల కు చేపని తీయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు.గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగ స్థానిక ఎస్సై తిరుపతిరావు సంఘటన స్థలానికి వచ్చి జాలర్లు, గ్రామస్తుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టాగా మృతదేహం లభ్యమయింది. ఫోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. గణపురపు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: