CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్వాతంత్ర సమరయోధులు సూర్య దేవర రాజయ్య మృతి.. నివాళులర్పించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్రా నరేంద్ర కుమార్..

Share it:


మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 11) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల కేంద్రంలోని కాకర్ల గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు సూర్యదేవర రాజయ్య (91) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ రాజయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల లేసి నివాళులర్పించారు. 

వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. సంతాపం తెలిపిన వారిలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు,  సిపిఐ సీనియర్ నాయకులు ఎల్లంకి మధు, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా, కాకర్ల గ్రామ శాఖ కార్యదర్శి చిమట ముత్తయ్య, బెజవాడ సీతయ్య, కంపసాటి నాగేశ్వరరావు, సోబ్బని శ్రీను, ఉదారి నాగయ్య,   ఇమ్మడి  నరేష్ తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: