మన్యం న్యూస్, చర్ల /దుమ్ముగూడెం ::
విద్యార్థిని అదృశ్యం అయిన సంఘటన చర్ల మండలంలో జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పాయం మహిత అనే విద్యార్థిని దుమ్ముగూడెం మండలం కే రేగుపల్లి ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది అయితే విద్యార్థిని మహిత దసరా పండుగ సెలవులు కావడంతో గ్రామంలో ఉంటుంది గురువారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనికి వెళ్లిన తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అయితే పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు జాడ కనిపించకపోవడంతో గ్రామంలోని కుటుంబ సభ్యులతో కలిసి వెతికారు ఎంత వెతికిన ఆచూకీ తెలియకపోవడంతో చర్ల పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. చర్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: