* ఎమ్మెల్యే రేగా కాంతరావు భారీ మెజారిటీ లక్ష్యంగా యువజన విభాగం కృషి చేయాలి
* పినపాకనియోజకవర్గ అభివృద్ధి లో రేగా కృషి మరువలేనిది.
* టిఆర్ఎస్ (బీఆరెస్) పార్టీ యువజన విభాగం మండల ఇంచార్జి బొశెట్టి రవి ప్రసాద్
మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోగల టిఆర్ఎస్ (బీఆరెస్)పార్టీ మండల కార్యాలయంలో పినపాక మండల టిఆర్ఎస్ (బీఆరెస్) యువజన అధ్యక్షులు గాండ్ల అశోక్ అధ్యక్షత బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆరెస్ పార్టీ యువజన విభాగం మండల ఇంచార్జి బొశెట్టి రవి ప్రసాద్ హాజరై మాట్లాడారు.టీఆరెస్ పార్టీభద్రాద్రి జిల్లా అధ్యక్షులు ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు అదేశాలమేరకు ఊరూరా యువజన విభాగం గ్రామ కమిటీలు ఏర్పాటు చెయ్యాలి అని పిలుపు నిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపగడపకు యువజన విభాగం విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రేగా కాంతరావు భారీ మెజారిటీ లక్ష్యంగా యువజన విభాగం కృషి చేయాలి అని అన్నారు.
ఇంతకుముందు చూడని పరిపాలన రేగాకాలంలో చూస్తున్నామని, ఆయన చేసిన అభివృద్ధి పనులే ఇందుకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆరెస్ (బిఆర్ఎస్) పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి , మండల యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చెన్నకేశవులు, బండ మనోజ్ రెడ్డి, బానోత్ రమేష్, యువజన నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: