CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నారాయణ పేట ఆదివాసుల ఐటిడి ముట్టడి

Share it:


 మన్యం న్యూస్,భద్రాచలం (అక్టోబర్ 26):దుమ్ముగూడెం మండలం నారాయణపేట గ్రామపంచాయతీ పరిధిలోని సిరిగుండం ఆదివాసులు బుధవారం  ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించారు .ఈ ముట్టడి కార్యక్రమానికి ఆదివాసి సంఘం జిల్లా అధ్యక్షుడు మడకం రమేష్ హాజరై మాట్లాడారు. నారాయణపేట పంచాయతీలో సిరిగుండం గ్రామంలోని ఆదివాసీలు 60 కుటుంబాలు నివాసం ఉంటున్నారు మీరు చతిస్గడ్ నుండి  సంవత్సరాల వలస వచ్చి సిరిగుండంలో నివాసం ఉంటున్నారు వీరికి  రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఓటు హక్కును కల్పించలేదని తక్షణమే ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. జీసిసి ద్వారా నిత్యవసర సరుకులు అందించాలని, ప్రభుత్వ స్కూలు, అంగన్వాడి సెంటర్ ఏర్పాటు చేయాలని, హెల్త్ వర్కర్ నియమించాలని వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని, కరెంటు ఇప్పించాలని పోడు భూములు  పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు.మడకం  రమేష్, మడకం పుల్లయ్య, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: