CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చింత ఎల్లయ్య ఆదర్శప్రాయుడు మేధావిని కమ్యూనిస్టు పార్టీ కోల్పోయింది సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ,అక్టోబర్ 21: ...నేటితరం యువతరానికి, మేదావులకు చింత ఎల్లయ్య ఆదర్శప్రాయుడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ, ఏఐటియుసి సీనియర్ నాయకులు, సింగరేణి మాజీ చీఫ్ ఫైనాన్స్ మేనేజర్ చింత ఎల్లయ్య సంస్మరణ సభ గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం 3 ఇంక్లైన్ కాలనీలో జరిగింది. సంస్మరణ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఉన్నత స్థాయి అధికారి హోదాలో ఉన్న చింత ఎల్లయ్య కార్మికులకు ఎనలేని సేవలందించారని అన్నారు. పదవి విరమణ అనంతరం సింగరేణి, ప్రభుత్వ ఉద్యోగాలకోసం జరిగే పోటీ పరీక్షలకు ఎందరో యువతి, యువకులకు ఉచిత శిక్షణను అందించి వారికి ఉపాది చూపారన్నారు. సిపిఐ, ఏఐటియుసి ఉద్యమాలల్లో చురుకైన పాత్ర పోషించారని, ఒక మేదావిని కమ్యూనిస్టు పార్టీ కోల్పోవడం బాధాకరమని, ఆయనను ఆదర్శంగా తీసుకొని పార్టీ శ్రేణులు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. తొలుత ఎల్లయ్య చిత్రపఠానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు వై. శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, బరిగెల సంపూర్ణ, మాతంగి లింగయ్య, లక్ష్మినారాయణ,  కె.సోమయ్య,  ఎల్లయ్య కుమారులు చింత వెంటకరమణ, చింత కిరణ్ కుమార్ తదితరులు  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: