CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమరుల సంస్మరణ సభలను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

Share it:


మన్యం న్యూస్ గుండాల,అక్టోబర్ ( 21) : అమరవీరుల సంస్కరణ సభలను జయప్రదం చేయాలని ప్రజాపందా రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటో తారీకు నుండి ఏడో తారీఖు వరకు జరిగే అమరుల సంస్కరణ సభలను గ్రామ గ్రామాన పార్టీ ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం ఎందరో ఎన్కౌంటర్లో మరణిస్తే మరి కొందరు అనారోగ్య కారణాల వల్ల మరణించారని వారందరిని స్మరిస్తూ సభలను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అమరుల సంస్కరణ సభలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చంద్ర అరుణ, మాచర్ల సత్యం, ఈసం శంకరన్న, డివిజన్ నాయకులు కొమరం శాంతయ్య, వాంకుడోత్ అజయ్, ఈసం చంద్రయ్య,బొర్రా వెంకన్న , సనప కుమార్, ఈసం కృష్ణ , పునేం రంగయ్య, గుర్రం పుష్పరాజు, కోడూరి జగన్, తెల్లం రాజు, ఎనుగంటి గణేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: