మన్యం న్యూస్, ఏటూరు నాగారం :
ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని అందులో భాగంగా ప్రజా దర్బారులో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో అంకిత్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బారు కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ వివిధ సమస్యలపై అందజేసిన 23 దరఖాస్తులను స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన ఆయన త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ వసంతరావు,డిప్యూటీ డైరెక్టర్ పోచం,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమలత,పి హెచ్ ఓ రమణ,ఆర్ సి ఓ రాజ్యలక్ష్మి, జిసిసి డిఎం ప్రతాపరెడ్డి అగ్రికల్చర్ ఆఫీసర్ లక్ష్మీప్రసన్న, హార్టికల్చర్ ఆఫీసర్ భారతి, ఐటీడీఏ మేనేజర్ శ్రీనివాస్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: