CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రమాద బీమా చెక్కు అందజేత

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం  : 

ములుగు జిల్లా ఏటూరు  నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన సోడి ఇరుమయ్య బి.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్త రోడ్డు ప్రమాదం గురై చనిపోగా ఇరుమయ్యకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా ఇన్సూరెన్స్ చెక్కు మంజూరవగా,ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు గడదాసునిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం సొడి ఇరుమయ్య భార్య రమణకు 200000/ రెండు లక్షల రూపాయల విలువగల చెక్కును పార్టీ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కల్పించి పార్టీ జెండా మోస్తూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు పార్టీ కొరకు పనిచేస్తున్న కార్యకర్తలు అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం సంభవించి చనిపోతే వారి కుటుంబాలకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా ఇన్సూరెన్స్ కల్పించి ఎంతోమంది కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యురాలు ఎండి వలియాబి సలీం,వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి,పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్,ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా,ఏటూరు నాగారం గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్ దన్నపునేని కిరణ్ కుమార్, మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు గార ఆనంద్,బట్టు రమేష్,కుమ్మరి చంద్రబాబు,జాడి భోజరావు, కొండాయి చిన్ని,అటిక నాగేశ్వరరావు,పాలకుర్తి విజయ్,మాజీ మండల మహిళా అధ్యక్షురాలు దొడ్డ వాణి,పతేహమ్మద్, చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు రాజు,ప్రధాన కార్యదర్శి మాచర్ల శ్రీనివాస్, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ,ఎండి ఇబ్రహీం, ఎండి ఖాజా,ఆడేపు  వెంకటేశ్వర్లు,ఎస్కే మహమ్మద్, అస్మత్,మనమ్మ,ఎస్.కె హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: