మన్యం న్యూస్ చండ్రుగొండ ప్రతినిధి : తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. సోమవారం రాత్రి తిప్పనపల్లి గ్రామంలో ఎంపీటీసీ లంకా విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ముగింపు వేడుకలకు ఆమెపాల్గొని ప్రసంగించారు. తొమ్మిది రోజులపాటు బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయబద్ధంగా ఆడపడుచులు ఆడి పాడి ముగింపు రోజున నీటిలో బతుకమ్మలను వదిలేయడం ఒక తెలంగాణ పండగకే సాధ్యమన్నారు . మహిళలు తమ సాంప్రదాయాలను ఈ స్థాయిలో గౌరవించే పండుగ మరో ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకుళ్ల సత్యనారాయణ, ఎంపీటీసీలు ధారా బాబు,లంకా విజయలక్ష్మి, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, గానుగుపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, టిఆర్ఎస్ నాయకులు దారా వెంకటేశ్వరరావు, ఉప్పతల ఏడుకొండలు, మాలోత్ భోజ్య నాయక్, భూపతి శ్రీనివాసరావు, సారేపల్లి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: