మన్యం న్యూస్: గుండాల (04) నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈనెల 8,9 తేదీలలో పిఓడబ్ల్యూ రాష్ట్ర ఏడవ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజాపంద డివిజన్ నాయకులు బొర్రా వెంకన్న పిలుపునిచ్చారు. మంగళవారం మండలం పరిధిలోని కాచనాపల్లి సెంటర్లో పి ఓ డబ్ల్యు పోస్టర్ను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు రిజర్వేషన్లలో చిన్న చూపు విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయన్నారు. మహిళల హక్కుల సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన ఘనత పిఓడబ్ల్యూ కి ఉందన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, బుచ్చిబాబు సమ్మక్క, కృష్ణకుమారి, మహేశ్వరి, రాంబాబు, మౌనిక, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: