మన్యం న్యూస్ , మంగపేట.:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన తెలంగాణ క్రీడా మైదానాలు ఇప్పటికి క్రీడలకు అనుకూలంగా లేకపోవటం శోచనీయం.వర్షం వచ్చినప్పుడు ఈత కొలనుల ఉండే క్రీడా ప్రాంగణాలు, ఇప్పుడు ఏపుగా పెరిగిన గడ్డితో అల రారుతుంది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు ఆర్భాటంగా ప్రారంభించిన క్రీడా మైదానాలు ఆదిలోనే హంస పాదులా, గ్రహణం పట్టి, చెప్పుకోవటానికి తప్ప క్రీడలకు అనుకూలంగా లేవు. మండలంలో ఏ ఒక్క క్రీడా మైదానం పనికి వచ్చే సూచనలు లేవు. ప్రతి క్రీడామైదానానికి దాని పరిమాణం బట్టి 2లక్షల ఏబైవేలు కేటాయించారు, అయినా కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది, కనీసం గ్రామస్తుల ఉదయపు నడకకు కూడా పని రాకుండ, కేవలం బోర్డులు పెట్టి చదును చేసి క్రీడా మైదానం అనే బిరుదును ఇచ్చి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికి అయినా క్రీడా మైదానాలు ప్రారంబానికే కాదు క్రీడలకు కూడా ఉపకరించేలా చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరారు.
Post A Comment: