CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీనియర్ రాజకీయ నేత దివంగత పొన్నెకంటి వీరభద్రం ప్రధమ వర్ధంతి.. నివాళులర్పించిన ఎమ్మెల్యే రాములు నాయక్.. పలువురు స్థానిక ప్రముఖులు..

Share it:


మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 9) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నేత, ప్రస్తుత ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్ తండ్రి దివంగత పొన్నెకంటి వీరభద్రం ప్రధమ వర్ధంతి కార్యక్రమం ఆదివారం కాకర్ల గ్రామంలో నిర్వహించారు. నివాళులు అర్పించిన వారిలో స్థానిక వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ పాల్గొన్నారు. వీరభద్రం చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. చెరగని చిరునవ్వు, పార్టీలకతీతంగా అందరితో కలిసిపోయే మనస్తత్వం, సహాయం కోరిన వారికి లేదనకుండా సహాయం అందించిన దానగుణం, రాజకీయ ఎత్తుగడలలో తనదైన శైలిలో వ్యవహరించే తీరు, "మాట తప్పని మడమ తిప్పని" వ్యక్తిత్వం గల వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని తనతో ఉన్న అనుబంధాన్ని మధురస్మృతులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, స్థానిక ఎంపీపీ సోనీ, సొసైటీ చైర్మన్ వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ మధుసూదన రావు, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు వీరభద్రం, పార్టీ సీనియర్ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, లాకావత్ గిరిబాబు, నున్న రంగారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్రా నరేంద్ర కుమార్, సీనియర్ నాయకులు మాజీ సొసైటీ డైరెక్టర్ కాజా రమేష్ తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: