మన్యం న్యూస్ : జూలూరుపాడు, (అక్టోబర్ 9) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని నాగేశ్వరరావు తండ్రి రంగయ్య అను వ్యక్తి సుమారు 7 క్వింటాళ్ళ ప్రభుత్వ చౌక బియ్యాన్ని లబ్ధిదారుల వద్ద నుండి చౌక ధరకు కొనుగోలు చేసి అట్టి బియ్యాన్ని అన్నారుపాడు గ్రామ శివారున గల వ్యవసాయ పొలంలో దాచి ఉంచి కొత్తగూడెం తరలించడానికి ప్రణాళిక రూపొందిస్తుండగా, ఇట్టి విషయం గమనించిన స్థానికులు కొందరు డయల్ 100 ద్వారా జూలూరుపాడు పోలీసువారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జూలూరుపాడు పోలీసు అక్కడికి చేరుకొని కొమ్మినేని నాగేశ్వరావుని అదుపులోకి తీసుకొని, పట్టుబడ్డ ప్రభుత్వ చౌక బియ్యాన్ని ఇద్దరు పంచుల సమక్షంలో స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ ప్రభుత్వ చౌక బియ్యం విలువ సుమారు 15 వేల 400 రూపాయల వరకు ఉంటుందని, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నట్లు ఏ ఎస్ ఐ బోయినపల్లి తిరుపతిరావు తెలిపారు.
Navigation
Post A Comment: