- వాహనాదారులు ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి.
- జానంపేట నుండి కరక గూడెం,రంగాపురం రోడ్డు పై అధిక లోడుతో వస్తున్న ఇసుక లారీలను తిప్పి మరలా ఏడుళ్ళ బయ్యారం వైపు ఎస్ఐ జీవన్ రాజు
- మండల ప్రజలు ఎస్ఐ కి అభినందనలు
మన్యం న్యూస్ కరకగూడెం: వాహనదారులు వాహన దృవీకరణ పత్రలు తమవేట తిసుకోని రావాలని,ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని,అదే విధంగా వాహన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఎస్ఐ జీవన్ రాజు అన్నారు.ఏడూళ్లూ బయ్యారం నుండి కరకగూడెం వైపు అధిక ఇసుక లోడుతో వస్తున్న లారీలు ప్రవేశించడంతో రోడ్లు పాడవుతున్నయని మండల ప్రజల అభిప్రాయం మేరకు అటుగా వచ్చిన వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి ఏ బిల్లు కగితలు ఉండి కాట బిల్లు లేని కారణంగా పదహారు లారీలని ఎనక్కి తిప్పి పంపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రూట్ కి పర్మిషన్ లేదు రాకూడదని లారీ డ్రైవర్ లకి వార్నింగ్ ఇచ్చి చలానలు వేయించి మరల ఇసుక లారిలను తిప్పి పంపించడం జరిగిందని తెలిపారు. అలాగే వాహన దారులు బయటకు వచ్చినప్పుడు వాహనాలను నడిపే సమయంలో వేగం తగ్గించి నడపాలని అన్నారు.ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు.
ఇసుక లారీలను తిప్పి మరల ఏడుళ్ళ బయ్యారం వైపు పంపడంతో ఎస్ఐని అభినందనలు తెలిపిన మండల ప్రజలు
అధిక లోడుతో వస్తున్న ఇసుక లారీల వలన రోడ్లు పూర్తిగా పాడవుతున్నాయని మండల ప్రజల అభిప్రాయం మేరకు ఇసుక లారీలను తిప్పి మరల ఏడుళ్ళ బయ్యారం వైపు పంపడంతో మండల ప్రజలు ఎస్ఐ,పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
Post A Comment: