మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10.. రామాయణం అనే గొప్ప మహా కావ్యం తో అనుబంధాలను చాటిచెప్పిన మహర్షి వాల్మీకి అని జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో ఆదివారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి చిత్రపటానికి అదనపు కలెక్టర్ పూలమాలలు అర్పించారు.
అనంతరం అంబేద్కర్ భవన్ లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహర్షి వాల్మీకి బోయ కులంలో పుట్టి దొంగతనాలు చేస్తూ జీవనం కొనసాగించే వాడని తను చేస్తున్న పని సరికాదని విజ్ఞత పెంచుకొని గొప్ప జ్ఞాని కాగలిగాడు అన్నారు. రామాయణం అనే మహాకావ్యం తో జీవన సంబంధాలను లోకానికి చాటారని అంతటి గొప్ప మహర్షి కి ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి చూపిన బాటలో కొనసాగితే జీవన పరిమళాలను ఆస్వాదించవచ్చు అన్నారు. రామరాజ్యం ప్రజల కర్తవ్యాన్ని బోధించిందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ అభివృద్ధి అధికారి సురేందర్ , కలెక్టరేట్ ఏవో గన్యా, కొత్తగూడెం తాసిల్దార్ రామకృష్ణ, డి వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నాయకులు ముసలయ్య, మల్లెల రామనాథం, ఏం కిషోరు ,బి.జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: