మన్యం న్యూస్ , అక్టోబర్ 21, దుమ్ముగూడెం :
దళిత బంధు యూనిట్లు పొందిన లబ్ధిదారులు అందరూ ఆర్థికంగా ఎదిగి మిగతా వారికి జీవన అభివృద్ధి జరిగే విధంగా చూడాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. మండలంలోని లక్ష్మీనగరం గ్రామంలో దళిత బందు పొందిన లబ్ధిదారులకు యూనిట్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ఇటువంటి పథకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరెన్నో ప్రవేశపెట్టాలని తెలిపారు లబ్ధి చేకూరినటువంటి లబ్ధిదారులందరూ వారు తీసుకున్నటువంటి యూనిట్లను పూర్తిస్థాయిలో వినియోగించుకొని వారితో పాటు పదిమందికి జీవన అభివృద్ధి జరిగే విధంగా చూడాలని ఆకాంక్షించారు. అనంతరం లబ్ధిదారుల వాహనాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీవో చంద్రమౌళి మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక శ్రీనివాసరావు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతిర్యాల రవికుమార్ మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు బైరెడ్డి సీతారామారావు పిలక వెంకటరామిరెడ్డి సంగీతరావు తెల్ల హరికృష్ణ వేణు చంటి అప్పల్ రెడ్డి శ్రీను సుందర్ భద్రాచలం కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్ సీనియర్ నాయకులు నరసింహారావు రంగారావు శ్రీనివాస్ దళిత బంధు పొందిన లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: