మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి , అక్టోబర్ 21 :
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐ ఎం ఏ హాల్ నందు ఉదయం 10.30 గంటలకు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు. విధినిర్వహణలో ముష్కరుల దాడిలో అసువులు బాసిన పోలీసు అమరువీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ రక్తదాన కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణ,పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు.
Post A Comment: