మన్యం న్యూస్ , మంగపేట. :
ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంధాలయం కార్యాలయంలో గోవిందరావుపేట టీఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ హరి బాబు ఆధ్వర్యంలో
ములుగు జిల్లా గ్రంధాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ ను కలసి వెనుకబడిన జిల్లాలో అన్ని గ్రామాల్లో, గూడెంలల్ల,తండాలలో గ్రంధాలయాలు ఏర్పాటు చేయాలని అని వినతి పత్రం ఇచ్చారు.
నూతనంగా ములుగు జిల్లా గ్రంధాలయం చైర్మన్ గా పోరిక గోవింద్ నాయక్ నియామకం అయిన శుభ సందర్భంగా దళిత ఐక్యత సమితి నాయకులు ఘనంగా సన్మానించి స్వీట్లు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం నిబంధనలు మేరకు గ్రంధాలయం లైబ్రరీ మార్గదర్శకాలు బట్టి గ్రంధాలయాలు ఏర్పాటుకు కృషి చేస్తాను అని గ్రంధాలయం చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ తెలిపారు.
దళిత ఐక్యతా సమితి అధ్యక్షులు, బాలకృష్ణ నెమలి,దర్శనాల సంజీవ,
పీఎసియస్ మచ్చ పూర్ డైరెక్టర్ దూడపక రాజేందర్,జన్ను కరుణాకర్, బొల్లం శివ,అంబల నరేందర్,పసుల భద్రయ్య,పసులసమ్మయ్య,విజయ్,మామిడి అబ్బాస్,మల్లేష్,రాములు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: