మన్యం న్యూస్, అక్టోబర్ 21 ,వాజేడు.:
అయోడైజ్డ్ ఉప్పు ప్రజలు వినియోగించకపోవడం పట్ల ఆరోగ్యం పై అవగాహన కల్పించాలని వాజేడు పిహెచ్సి ఆధ్వర్యంలో జాతీయ అయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం నిర్వహించారు.మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, అయోడైజ్డ్ ఉప్పు ప్రయోజనాలను ప్రజలకు ర్యాలీ ద్వారా తెలిపారు. ప్రతి ఇంట్లో అయోడైజ్డ్ ఉప్పు వినియోగం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయోడిన్ ఉప్పు ఆరోగ్యానికి నాంది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తల్లడి పుష్పలత, ఎంపీపీ శ్యామల శారద ,మాత శిశు సంరక్షణ వైద్యాధికారి మహేందర్, డాక్టర్ శాంతి సౌర్య, సిహెచ్ఓ సూర్యప్రకాష్ రావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్, హై స్కూల్ హెచ్ఎం, వైద్య సిబ్బంది కోటిరెడ్డి ,చిన్న వెంకటేశ్వర్లు, అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: