మన్యం న్యూస్,అశ్వాపురం:అశ్వాపురం మండలం తుమ్మలచెరువు పోస్ట్ ఆఫీస్ పరిధిలో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జనరల్ యాక్సిడెంటల్ పాలసీ పై శుక్రవారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాతుమ్మల చెరువు గ్రామం లో పలువురు గ్రామస్తులు టాటా AIG యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నారు. కేవలం 399/-తో 10 లక్షలప్రమాద భీమా పాలసీ తీసుకుంటే పాలసీ దారులకు తక్కువ ప్రీమియం తో ఎక్కువ ప్రయోజనాలు కలుగుతున్నాయని పోస్టల్ ఇన్స్పెక్టర్ సురేందర్ తెలియజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎంపీటీసీ తాటి పూజిత గ్రామం లో ప్రతి ఓక్కరు ప్రమాద భీమా పాలసీ తీసుకోవాలని సూచించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలో పాలసీలను వివరించారు.అనంతరం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో 5సంవత్సరాలలోపు పిల్లలకు ఉచితంగా ఆధార్ నమోదు,ఆధార్ కు ఫోన్ నెంబరు లింక్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధులు ,ఉప సర్పంచ్ పాయం కామరాజు, సొసైటీ డైరెక్టర్ కోరేం నరసింహారావు , పాల్గొని పాలసీలు తీసుకున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది సుధీర్,బాబ్జి, ఆనంద్,నవీన్ రెడ్డి, జీనత్,ఇందుమతి,సాయి కుమార్, వెంకట్రావు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: