జూలూరుపాడు, అక్టోబర్ 2, (మన్యం న్యూస్ ప్రతినిధి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 2, "గాంధీ జయంతి" సందర్భంగా వైరా శాసన సభ్యులు లావుడ్యా రాములు నాయక్ ఆదేశానుసారం ఆదివారం జూలూరుపాడు మండల కేంద్రంలోనీ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జేయంతి వేడుకలు నిర్వహించారు.
మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల లేసి ఘనంగా నివాళలర్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, జిల్లా నాయకులు యల్లంకి సత్యనారాయణ, రైతుబంధు మండల కోఆర్డినేటర్ యదళపల్లి వీరభద్రం, మండల ప్రధాన కార్యదర్శి నున్న రంగారావు, పార్టీ నాయకులు రామిశెట్టి రాంబాబు, రామి శెట్టి నాగేశ్వరావు, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, యువజన నాయకులు దొండపాటి శ్రీనివాసరావు, మోదుగు రామకృష్ణ, ఎస్కే సుభాని, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: