మన్యం న్యూస్: గుండాల (02) గుండాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ మండల అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు గాంధీజీకి దండ వేసి నివాళులర్పించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా గుండాల తాసిల్దార్ నాగదివ్య, సీఐ కరుణాకర్ హాజరై కేక్ కట్ చేశారు. ప్రతి సంవత్సరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలను గౌరవంగా నిర్వహిస్తామని మానాల వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీ ఓ జరత్ వలి, ఉప సర్పంచ్ ఉపేందర్, మానాల నారాయణమూర్తి, గౌరిశెట్టి సత్యనారాయణ, ప్రభాకర్, తడిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: