CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను కాపాడండి ప్రజావాణిలో సింగరేణి భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తలమానికంగా నిలిచిన సింగరేణి లీజ్ భూములను బడాబాబులు అన్యాక్రాంతం చేయకుండా కాపాడాలని సింగరేణి భూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అనుదీప్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు బండి రాజు గౌడ్ మాట్లాడుతూ సింగరేణి గనుల ఆధారంగా ఏర్పడిన ఇక్కడ గనుల్లో పనిచేసే కార్మికులకు కనీస సౌకర్యాలు చేసేందుకు సింగరేణి సంస్థ విద్య ,వైద్యం, కనీస సౌకర్యాలు పేరుతో పట్టణంలో కొన్ని స్థానాలు వ్యాపారస్తులకు అప్పగించిందని ఒప్పందం ప్రకారం వ్యాపారస్తులు ఆ వ్యాపారాన్ని చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపారు. కాలక్రమేణా పట్టణం పెరగడంతో సింగరేణి రిలీజ్డ్ స్థలాలు విలువైన స్థలాల గా మారాయని దీంతో కొందరు బడాబాబులు ఆక్రమణలు చేస్తూ సింగరేణి భూములను సైతం విక్రయిస్తున్నారని ఆరోపించారు. కొత్తగూడెం మున్సిపాలిటీ అధికారులు తక్షణమే సింగరేణి భూములను స్వాధీనపరచుకొని  కోట్ల రూపాయల విలువైన భూములను పరిరక్షించాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో సింగరేణి భూ పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి హుస్సేన్, బానోత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: