మన్యం న్యూస్ , దుమ్ముగూడెం ::
మండలంలోని గత కొంతకాలంగా విచ్చలవిడిగా సాగుతున్న రేషన్ బియ్యం దందా పై అధికారులు ఆరోపణలు రావడంతో అప్రమత్తమైన సివిల్ సప్లై అధికారులు మండలంలోని ప్రత్యేక నిగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నడికుడి గ్రామం నుంచి ఆటోలో 8 క్విoటాలు రేషన్ బియ్యం తరలిస్తుండడంతో పక్కా సమాచారం అందుకున్న రెవిన్యూ సిబ్బంది గంగోలు గ్రామం వద్ద వారిని పట్టుకున్నారు పంచనామా నిర్వహించిన అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తాసిల్దార్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ దాడిలో రెవెన్యూ సిబ్బంది ఆదినారాయణ లక్ష్మయ్య పాల్గొన్నారు.
Post A Comment: