CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగు గిరిజన రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి... తెలంగాణ గిరిజన సంఘం పోరాట ఫలితమే పోడు భూముల సర్వే.. తెలంగాణ గిరిజన సంఘం మండల కార్యదర్శి భూక్య శంకర్..

Share it:



మన్యం న్యూస్ :  జూలూరుపాడు, (అక్టోబర్ 10) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అనేక సంవత్సరాల పోరాట ఫలితంగానే పోడు భూములు సాగు చేస్తున్న గిరిజన రైతుల పోడు భూములకు ఎఫ్ఆర్సి కమిటీల ఆధ్వర్యంలో సర్వేలు ప్రభుత్వం చేపట్టిందని, రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రజల సమస్యల మీద పెద్ద ఎత్తున ఆందోళన సిపిఐ తెలంగాణ గిరిజన సంఘం నిర్వహించిందని,  తెలంగాణ గిరిజన సంఘం జూలూరుపాడు మండల కార్యదర్శి భూక్య శంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్వే సందర్భంగా పోడు భూముల కు దరఖాస్తు చేసుకున్న గిరిజనులకు భూములన్ని సర్వే పూర్తి చేసి హక్కు పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  పోడు రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాడి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామని తెలిపారు. పోడు రైతుల పక్షాన పోరాడి  అనేక నిర్బంధాల పాలై, అక్రమ కేసుల పాలైన వారిపై కేసులన్నీ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి నిబంధన లేకుండా సజావుగా పోడు పత్రాలు ఇవ్వాలని కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: