మన్యం మనుగడ, మంగపేట. :
తెలంగాణ ప్రభుత్వం పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పడం తో స్థానిక ఎఫ్ ఆర్ సి కమిటీలకు ఆదివాసీలు దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఇటీవల ప్రకటించిన లిస్ట్ లో తోండ్యాల లక్ష్మీపురం గ్రామంనకు చెందిన సుమారు 20 పేర్లు మిస్ అయ్యాయని, వీటిపై సంబంధిత అధికారుల కు పిర్యాదు చేయగా ఎడిట్ ఆప్షన్ లేదని మేము ఏమి చేయలేమని అంటున్నారని దీని వలన ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తంచేశారు. అప్లికేషన్ లు తీసుకొని రికార్డ్ లో పేర్లు నమోదు చేయకుండా, పేర్లు మిస్ అవ్వడానికి బాధ్యులు అయిన వారిపై చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు చింత కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదివాసి దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్నీ కోరారు.
ఈ కార్యక్రమం లో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, ఏ యస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్, తుడుం దెబ్బ నాయకులు పోదెం రవీందర్, చింత రమేష్, సోలం సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: