మన్యం మనుగడ, మంగపేట. :
తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం 13వ తేదీ ఉదయం 11:30 కు రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని కావున ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యమ నాయకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారు హాజరుకావాలని ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ ముంజల భిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం అరెస్టయి కేసుల పాలైన వారు జైలుకు వెళ్లిన వారు ప్రతి ఒక్కరూ రాజకీయాలకతీతంగా తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని మంజుల భిక్షపతి గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ వెంకట్ నారాయణ విచ్చేస్తారు అని అన్నారు .ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఏర్పాటు భవిష్యత్ కార్యాచరణ నిర్వహించడం జరుగుతుంది,ఇదే ఆహ్వానంగా భావించి తప్పక రాగలరని ఉద్యమకారులు వచ్చి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడి చర్చించవలసిన గా తెలియజేస్తూ,ఈ అవకాశాన్ని తెలంగాణ ఉద్యమకారుడు సద్వినియోగం చేసుకోవాలని, మేధావులు ఉద్యోగస్తులు తెలంగాణ ఉద్యమకారులు రాజకీయాలకతీతంగా విద్యార్థులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతి ఒక్కరూ తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారు హాజరుకావాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొలిపాక ప్రశాంత్ జనసేన పవన్ కళ్యాణ్ పార్టీ జిల్లా అధ్యక్షులు, బొచ్చు సాంబయ్య, రవీందర్, శ్రీను, సారయ్య,రవి,రమేష్,రవి,పౌలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: