మన్యం న్యూస్, భద్రాచలం /దుమ్ముగూడెం ::
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఐటిడిఏ నిధుల నుండి చేపడుతున్న నిర్మాణ పనులు కిచెన్ షెడ్, బ్లడ్ బ్యాంక్ విస్తరణ త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ సంబంధిత అధికారులతో తెలియజేశారు అలానే ఏజెన్సీల్లోని అన్ని మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రస్తుత కాలం సీజనల్ విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు అలానే సమావేశ హాల్ జరిగిన అధికారులతో మాట్లాడుతూ దసరా సెలవులు ముగియడంతో గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు ఏ టి డబ్ల్యూ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: